రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాల కోసం సీట్ల సంఖ్యను పెంచాలని ఐహెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర డైరెక్టర్ టి. అంజినయ్య ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న వెంకటేష్కు వినతిపత్రం అందజేశారు. పెరుగుతున్న డిమాండ్ కారణంగా అర్హులైన పేద
విద్యార్థులు సీట్లు కోల్పోతున్నారని, 2026-27 విద్యా సంవత్సరం నుంచే అదనపు సెక్షన్లు మంజూరు చేసి సీట్ల సామర్థ్యాన్ని 10-20 శాతం పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐహెచ్ఆర్ఎఫ్ సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు.