
భారీ ఉగ్రవాద కుట్రను ఛేదించిన పోలీసులు
ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) ఒక భారీ ఉగ్రవాద కుట్రను ఛేదించింది. 'గజ్వా-ఎ-హింద్' ప్రచారాన్ని అమలు చేసేందుకు సిద్ధమైన నలుగురు అనుమానితులను ఏటీఎస్ అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లకు నిప్పుపెట్టి భయోత్పాతం సృష్టించాలని వీరు పథకం వేసినట్లు ఏటీఎస్ గుర్తించింది. వీరి పాకిస్తానీ హ్యాండ్లర్లతో సంబంధాలున్నాయని, చిన్న దహనకాండ చర్యల వీడియోలు పంపి క్యూఆర్ కోడ్ల ద్వారా డబ్బు అభ్యర్థించేవారని ఏటీఎస్ భావిస్తోంది. ముఠా కీలక సభ్యుడు సాకిబ్ అలియాస్ డేవిడ్ను అరెస్ట్ చేశారు. ఈ ముఠా జాతీయ భద్రతకు భంగం కలిగించి, భారతదేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఏటీఎస్ పేర్కొంది.




