శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం నందికొట్కూరులో బుధవారం 98వ రోజు నిరాహార దీక్షలు చేపట్టారు. బాధితులు జయన్న మాట్లాడుతూ, కుటుంబ పోషణ కోసం దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దౌర్భాగ్యమని, న్యాయం చేయకపోతే ప్రజా సంఘాలను కూడగట్టుకొని ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం జీఓ. 98 సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.