మహానందిలోని తమ్మడపల్లెలో 70 ఏళ్ల తర్వాత పెద్దమ్మ తల్లి దేవర వైభవంగా బుధవారం జరిగింది. అమ్మవారి విగ్రహాన్ని పెద్దమ్మ అరుగు వద్ద ఆసీనులు చేశారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని, గ్రామోత్సవంలో పాల్గొన్నారు. కోలాటం, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి. 1956 తర్వాత ఈ దేవర జరగడంతో గ్రామమంతా భక్తులు, బంధుమిత్రులతో కిటకిటలాడింది.