ఆ దుకాణాలను సీజ్ చేయండి: నంద్యాల కలెక్టర్

992చూసినవారు
ఆ దుకాణాలను సీజ్ చేయండి: నంద్యాల కలెక్టర్
పాణ్యం మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ రాజకుమారి గణియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ సేవలు, ప్రజలకు అందుతున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ను చూసి డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలు వదిలి వెళ్లడంతో, వాటిని సీజ్ చేయించాలని ఆమె ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్