కార్తీక పౌర్ణమి సందర్భంగా, బుధవారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ యాదవ్ సంజామల మండలం పేరుసోములలోని శ్రీ విష్ణుకంటి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. క్షేత్ర నిర్వాహకుడు కంబగిరి స్వామి, ఉపాసకుడు రామ్మోహన్ స్వామి ఆధ్వర్యంలో స్పీకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.