శనివారం రాత్రి నంద్యాల పట్టణం నూనెపల్లె ఉపరితల వంతెనపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో షమీర్ (22) అనే యువకుడు మృతి చెందాడు. అతని స్నేహితుడు కిరణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. కిరణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో జీజీహెచ్ కు తరలించారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.