బండి ఆత్మకూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని వీపనగండ్ల గ్రామానికి చెందిన దాసరి త్రివేణి పదో తరగతి ఫలితాల్లో 583 మార్కులతో టాపర్గా నిలిచి అందరినీ ఆకట్టుకుంది. వ్యవసాయ పనులు చేసే చెన్నయ్య, రత్నకుమారి దంపతుల కుమార్తె అయిన త్రివేణి పట్టుదలతో చదివి ఈ విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సయ్యద్ రాఫీ, ఉపాధ్యాయ బృందం త్రివేణిని అభినందించి, ఆమె శుభాకాంక్షలు తెలిపారు.