AP: నరసాపురం-చెన్నై వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. నరసాపురం స్టేషన్ నుంచి కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ జెండా ఊపి రైలును ప్రారంభించారు. చెన్నై సెంట్రల్-విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నై సెంట్రల్లో ఉ.5.30 గంటలకు బయలుదేరే ‘వందేభారత్’.. రేణిగుంట, గూడురు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు చేరుకుంటుంది.