ఆత్మకూరులోని శివాలయం సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శుక్రవారం మురుగు కాలువ వివాదంలో విద్యుత్ ఉద్యోగి ప్రసాద్, ఒక కుటుంబం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రసాద్ గాయపడ్డారు. ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఆత్మకూరు ఎస్ఐ జిలానీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.