ఆత్మకూరు బైపాస్ వద్ద సీఐ గంగాధర్, సిబ్బందితో కలిసి వాహనాలపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. మైనర్లు నడిపిన స్కూటర్లను ఆపి, అవగాహన లేకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనదారులు పత్రాలు వెంట ఉంచుకోవాలని, ట్రాఫిక్కు ఆటంకం కలిగించకుండా పార్కింగ్ చేయాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ గంగాధర్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.