మర్రిపాడులో పట్టపగలే దొంగతనం, రూ. 70 వేల అపహరణ

1చూసినవారు
మర్రిపాడులో పట్టపగలే దొంగతనం, రూ. 70 వేల అపహరణ
సంగం మండలం మర్రిపాడులో పట్టపగలే దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన గొల్లపల్లి హజరత్తయ్య ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువాను పగులగొట్టి సుమారు రూ. 70 వేల నగదును అపహరించారు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :