కలువాయి మండలం, చింతలాత్మకూరు, కుల్లూరు సబ్ స్టేషన్ పరిధిలో శనివారం మెయింటినెన్స్ పనులు జరగనున్నాయి. ఈ కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.