మర్రిపాడు మండలం కృష్ణాపురం వద్ద మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుంచి పామూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే హైవే అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు.