కందుకూరు మండలం కొండముడుసుపాలెం గ్రామంలోని ఆర్ఎస్ఎస్ కేంద్రం వద్ద బుధవారం 'రైతన్న మీకోసం' కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరవుతారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.