కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డులో గురువారం ఉదయం కెనరా బ్యాంకు వద్ద బైక్, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని 108 అంబులెన్స్లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.