కందుకూరుకు ఇన్చార్జి డిప్యూటీ డీఈఓగా అదనపు బాధ్యతలు స్వీకరించిన టి. రవి, గురువారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ఆయనకు బొకే అందజేసి శాలువాతో సత్కరించారు. ప్రస్తుతం నాగులుప్పలపాడు ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న టి. రవికి ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఈఓ అజయ్బాబు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.