వలేటివారిపాలెం: సచివాలయాలు తనిఖీ చేసిన ఎంపీడీవో

శుక్రవారం ఎంపీడీవో శంకరరావు వలేటివారిపాలెం(M) బడేవారిపాలెం, నూకవరం సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డులను పరిశీలించి, సిబ్బందికి సమయపాలన పాటించాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన హెచ్చరించారు.
