కావలిలోని శ్రీ లక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో శనివారం తొలి ఫిజియోథెరపీ స్నాతకోత్సవం, వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, తొలి బ్యాచ్ ఫిజియోథెరపీ విద్యార్థులకు తన చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. కావలిలో ఫిజియోథెరపీ కళాశాల స్థాపించి, తొలి స్నాతకోత్సవాన్ని నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.