నెల్లూరు జిల్లా దగదర్తి మండలం లయన్స్ నగర్ వద్ద బుధవారం మంగళవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న రమణమ్మ (65) అనే మహిళ గుండెపోటుతో మృతి చెందారు. కొండాపురం మండలం సాతానోరిపాలెంకు చెందిన ఆమె నెల్లూరులోని ఆసుపత్రిలో చికిత్స పొంది స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కారు. లయన్స్ నగర్ వద్దకు రాగానే అస్వస్థతకు గురికాగా, హైవే మొబైల్ సిబ్బంది ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని సాతానోరిపాలెంకు తరలించారు.