నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలంలోని మొత్తల గ్రామంలో ఆదివారం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.