కోవూరు: కార్తీక కోటి దీపాన్ని వెలిగించిన కోవూరు ఎమ్మెల్యే

4చూసినవారు
కోవూరు: కార్తీక కోటి దీపాన్ని వెలిగించిన కోవూరు ఎమ్మెల్యే
పవిత్ర కార్తీక మాస సోమవారం సందర్భంగా, కోవూరు ఎమ్మెల్యే మరియు టీటీడీ బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శ్రీశైలం మహా పుణ్య క్షేత్రంలో కార్తీక కోటి దీపాన్ని వెలిగించారు. సోమవారం శ్రీశైలం వెళ్లిన ఆమె, శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. కార్తీక మాసంలో కోటి దీపం వెలిగించడం సంతోషంగా ఉందని, స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :