మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 75 ఏళ్ల వృద్ధుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. గుర్తుతెలియని వ్యక్తిగా గుర్తించినట్లు రైల్వే ఎస్సై హరి చందన తెలిపారు. చెన్నై–విజయవాడ మార్గంలో రైల్వే మార్గం వద్ద ఈ ఘటన జరిగింది. వైట్ కలర్ షర్టు ధరించి ఉన్న మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.