నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, శుక్రవారం ఆటోనగర్ ప్రాంతంలో ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికంగా ఉన్న ఈ-ఆటో ఛార్జింగ్ పాయింట్ నిర్వహణ తీరును పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, డీఈ రఘురాం, సిబ్బంది పాల్గొన్నారు.