పర్యావరణ పరిరక్షణకు కార్యాచరణతో పరిచేయాలి

4చూసినవారు
పర్యావరణ పరిరక్షణకు కార్యాచరణతో పరిచేయాలి
పర్యావరణ పరిరక్షణకు సమగ్ర కార్యాచరణతో పనిచేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులకు సూచించారు. మంగళవారం ఉదయం నెల్లూరు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి అటవీ, వన్యప్రాణి పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసి అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ రవాణాను కట్టడి చేయాలని ఆదేశించారు. నగరవనాల నిర్వహణ, వనరుల సమీకరణపై కూడా చర్చ జరిగింది.

ట్యాగ్స్ :