ఇందుకూరుపేట మండలం మైపాడు పడమటిపాలేనికి చెందిన కొండూరు మల్లికార్జున 2016 డిసెంబర్ 12న వచ్చిన తుపానులో చెన్నై సముద్రంలో మృతిచెందారు. తమిళనాడు ప్రభుత్వం 2018లో గెజిట్ ద్వారా మరణాన్ని ధ్రువీకరించినా.. ఇప్పటికీ కుటుంబానికి డెత్ సర్టిఫికెట్, ఎక్స్గ్రేషియా అందించలేదు. తొమ్మిదేళ్లుగా మృతుడి కుటుంబ సభ్యులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు.