గంజాయి ముఠా నాయకుడు అరవ కామాక్షి టీడీపీకి చెందిన వ్యక్తి అని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కామాక్షి వైయస్సార్సీపీకి చెందిందని, తమ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.