నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 47వ డివిజన్లోని కుక్కల గుంట మహాలక్ష్మమ్మ గుడి, కోటమిట్ట ప్రాంతాలలో కమిషనర్ వై. ఓ నందన్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను, ముఖ్యంగా శిథిలావస్థకు చేరుకున్న భవనాలను, హోమియోపతి హాస్పిటల్ నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో 47వ డివిజన్ కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ కూడా పాల్గొని స్థానిక సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.