నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న పిన్నెల్లి సోదరులను మాజీ మంత్రి వైసిపి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మూలాఖత్ లో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని అధికారులను హెచ్చరించారు. అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.