ప్రభుత్వ వ్యవస్థల్లో అత్యంత కీలకమైన పోలీసు వ్యవస్థ, ప్రజలకు, ప్రభుత్వానికి శక్తికి మించి సేవలు అందిస్తున్నప్పటికీ, తరచుగా విమర్శలకు గురవుతోంది. ఇటీవల నెల్లూరులో పెన్నా నదిలో చిక్కుకున్న 17 మందిని, ఉయ్యాలపల్లి అడవిలో ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికితీయడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు. వారి సేవలను పలువురు 'శభాష్ పోలీసన్న.. మీ సేవలు సూపర్' అంటూ ప్రశంసించారు.