పులివెందుల నుంచి నెల్లూరు వస్తున్న ఆర్టీసీ బస్సులో రద్దీ కారణంగా గేర్ బాక్స్ పై కూర్చోవడానికి ప్రయత్నించిన ఓ మహిళతో డ్రైవర్ వాగ్వాదానికి దిగారు. డ్రైవర్ వద్దని చెప్పడంతో గొడవ పెరిగింది. దీంతో డ్రైవర్ బస్సును మర్రిపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాసరావు మహిళతో మాట్లాడి, గొడవ లేకుండా అక్కడి నుంచి పంపించారు.