గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు స్వర్ణ పంచాయతీ కార్యక్రమం వేగవంతమైందని, ఇంటి పన్ను చెల్లించిన వారికి వెంటనే ఆన్లైన్లో రసీదు ఇచ్చే విధానం అమలు చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి వసుమతి తెలిపారు. మంగళవారం పొదలకూరులో ఇళ్లు, దుకాణాలను సందర్శించి, పన్నులు బకాయిలు లేకుండా వెంటనే చెల్లించాలని వ్యాపారులు, గృహ యజమానులకు కరపత్రాలు పంపిణీ చేశారు.