పొదలకూరు మండలం నావూరు గ్రామం పడమటి కంచెలో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన వెనుక ఆకతాయిల చేష్ట ఉందా లేక మరేదైనా కారణం ఉందా అనే దానిపై విచారణ జరుగుతోంది.