నాయుడుపేటలోని శ్రీరామ్నగర్ కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. గిరిజమ్మ అనే వృద్ధురాలి చిల్లర దుకాణంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి, ఆమె మెడలోని 4 సవర్ల బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.