కొండాపురం మండలం రేణమాల గ్రామంలో శుక్రవారం టీడీపీలో భారీగా చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నాయకులతో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు, యువత, మహిళలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయకత్వంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో ప్రజలు
టీడీపీ వైపు వస్తున్నారని తెలిపారు.