ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని సీతారామపురం మండలం ఎస్.ఆర్ నగర్లో
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా జరిగింది. తురక సత్యం కుమారులైన వెంకటేశ్వర్లు, వెంకట రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి మండల
టీడీపీ అధ్యక్షుడు చింతల శ్రీను, మాజీ అధ్యక్షుడు వెంగలశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ
టీడీపీ నాయకులు, యువత, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.