వింజమూరు మండల పరిధిలోని ఎంపీపీ పదవికి ఈనెల 5వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈఓ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఎంపీటీసీలకు ఈనెల 1వ తేదీ నుంచి నోటీసులు జారీ చేయబడతాయని, 5వ తేదీ ఉదయం 11 గంటలకు అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఆ సమయంలో కోరం లేకపోతే, 6వ తేదీ ఉదయం 11 గంటలకు తిరిగి ఎన్నిక నిర్వహిస్తామని, ఈ ప్రక్రియ ఎంపిడిఓ కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు.