నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విజయవాడ, విజయనగరం, హైదరాబాద్ వంటి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో హంసలదీవి బీచ్కు చేరుకున్నారు. దీంతో బీచ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. పర్యాటకులు తిరుగు ప్రయాణంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సముద్ర తీరం వెంబడి మెరైన్ సిబ్బంది గస్తీ నిర్వహించారు.