మొబైల్ యూజర్లకు త్వరలో కొత్త రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి రానుంది. డేటా అవసరం లేని వారి కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను తీసుకురావాలని ట్రాయ్ ప్రతిపాదించింది. కేవలం కాల్స్, SMSలు మాత్రమే ఉండే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను తేవాలని చెప్పింది. ప్రస్తుతం డేటా ప్లాన్లు ఏయే వ్యాలిడిటీతో ఉన్నాయో, వాయిస్+మెసేజ్ ప్లాన్లనూ అదే వ్యాలిడిటీతో తేవాలని టెలికం కంపెనీలకు సూచించింది.