ఐపీఎల్ కొనసాగుతున్న వేళ బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆయా జట్లలో బెంచ్కు పరిమితమైన ఆటగాళ్లు మైదానంలో తిరగడానికి వీల్లేదని ఆదేశించింది. ఇకపై టీమ్షీట్లోని 16 మందికే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. బెంచ్పై ఉన్న ఆటగాళ్లు డ్రింక్స్, బ్యాట్స్, సందేశాలు తీసుకురాకూడదని పేర్కొంది. బౌండరీ చుట్టూ ఐదుగురి కంటే ఎక్కువ మంది బెంచ్ ప్లేయర్స్ ఉండొద్దని తెలిపింది.