దేశంలో బంగారం, వెండిపై పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్ 1 నుండి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. సెబీ (SEBI) కొత్త నిబంధనల ప్రకారం, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల (ETF) ధరలు ఇకపై అంతర్జాతీయ ప్రమాణాలకు బదులుగా భారతీయ ఎక్స్ఛేంజీల 'దేశీయ స్పాట్ ధర' ఆధారంగా నిర్ణయిస్తారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం తగ్గుతుంది. సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB) విషయంలో ప్రభుత్వం పన్ను నిబంధనలను కఠినతరం చేసింది. డిజిటల్ గోల్డ్ పెట్టుబడులపై కూడా పారదర్శకమైన పన్ను విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.