AP: కుప్పం నియోజకవర్గంలో
టీడీపీ నాయకత్వ మార్పుతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను తప్పించి, అనంతపురం జిల్లాకు చెందిన మరో శ్రీకాంత్కు పీఏగా బాధ్యతలు అప్పగించారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న వ్యక్తి కేడర్తో సత్సంబంధాలు నెరపలేకపోతున్నారని, ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణకే పరిమితమవుతున్నారని, స్థానిక రాజకీయ సమస్యలను పట్టించుకోవడం లేదని నాయకులు, కార్యకర్తలు మధనపడుతున్నారు.