నిస్సాన్ ఇండియా తమ కొత్త గ్రావైట్ MPVను భారత మార్కెట్లో ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మోడల్ జనవరి 21న లాంచ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. గ్రావైట్ తర్వాత టెక్టన్ SUVని కూడా లాంచ్ చేయనుంది. 2027లో కొత్త 7-సీటర్ SUVని తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. గ్రావైట్ MPVలో 7-ఇంచ్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8-ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, Android Auto & Apple CarPlay సపోర్ట్, వైర్లెస్ ఛార్జింగ్, సెంటర్ కన్సోల్లో కూల్డ్ స్టోరేజ్, సెకండ్ రో సీట్లకు స్లైడ్ & రిక్లైన్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.