ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు నితీష్ రెడ్డి దూరం?

6612చూసినవారు
ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు నితీష్ రెడ్డి దూరం?
ఐర్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా, ఇంగ్లాండ్‌కు చేరుకుంది. అయితే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. గతంలో తొడ కండరాల గాయానికి గురైన నితీష్, ఇంకా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఉన్నాడు. వన్డే సిరీస్ ప్రారంభానికి 14 రోజులు మాత్రమే సమయం ఉండటంతో, అతను ఫిట్‌నెస్ నిరూపించుకుని ఇంగ్లాండ్ వెళ్లడం కష్టంగా కనిపిస్తోంది. అతని స్థానంలో సూర్యాంశ్ షెడ్గేను ఎంపిక చేసే అవకాశాలున్నాయి.

సంబంధిత పోస్ట్