సరైన కారణం లేకుండా భర్తను విడిచి వెళ్లిన భార్యలకు భరణం పొందే హక్కు లేదని ఛత్తీస్గఢ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లైన నాలుగు రోజులకే భర్త, అత్తమామలపై వరకట్న వేధింపుల కేసు పెట్టిన ఓ మహిళ పిటిషన్ను విచారించిన సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భర్త తనతో కలిసి ఉండాలనుకుంటున్నప్పటికీ, భార్య అత్తింటిని వదిలి వెళ్లడానికి చట్టబద్ధమైన, సహేతుకమైన కారణాలు చూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది.