AP: టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డికి గురువారం పోలీసులు నోటీసులు అందజేశారు. విగ్రహ వివాదంపై అలిపిరి పోలీస్ స్టేషన్లో కరుణాకర్రెడ్డిపై మంగళవారం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు తిరుపతి ఈస్ట్ డీఎస్పీ కార్యాలయంలో ఈనెల 19, 20 తేదీల్లో ఏదో ఒక రోజు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.