
చందర్లపాడు: బాలికపై దారుణం.. నలుగురు కలిసి!
చందర్లపాడు మండలంలో 15 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్న పిల్లలతో ఆడుకుంటున్న బాలికకు జామకాయలు ఆశ చూపి ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. జామకాయల్లో మత్తు మందు కలిపి అత్యాచారం చేసినట్లు బాలిక బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.



































