విజయవాడలోని సింగ్ నగర్ లో మంగళవారం శ్వేత అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. మొదటి భర్తతో విడిపోయి షణ్ముఖ శ్రీనివాస్ ను వివాహం చేసుకున్న శ్వేత, అతనితో కలిసి జీవిస్తోంది. స్విగ్గీలో పనిచేసే షణ్ముఖ శ్రీనివాస్ తో ఇటీవల ఆఫీస్ టైమింగ్స్ విషయంలో వివాదం తలెత్తడంతో, మంగళవారం ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.