AP: గుంటూరు కలెక్టరేట్లో సోమవారం దారుణ ఘటన వెలుగు చూసింది. దాసరి పాపయ్య అనే వృద్ధుడు తన ఇంటిని ఆక్రమించారని, ఫిర్యాదు చేసినా ఫిరంగిపురం పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పెట్రోల్ పోసుకుని ఆందోళనకు దిగాడు. స్థానికులు, పోలీసులు వృద్ధుడి నుంచి పెట్రోల్ సీసాను లాక్కున్నారు. తన ఇంటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.