ఆపరేషన్ సిందూర్లో 50 కంటే తక్కువ ఆయుధాలే వినియోగించినట్లు ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ ఎయిర్మార్షల్ నర్మదేశ్వర్ తివారీ తెలిపారు. జాతీయ మీడియా సదస్సులో శనివారం ఆయన మాట్లాడుతూ.. పాక్తో ఘర్షణలను ఆపేందుకు తక్కువ ఆయుధాలనే వినియోగించామని పేర్కొన్నారు. నియంత్రణ లేఖ వెంట నాలుగు రోజులపాటు మిసైల్ దాడులు చేయడంతో పాకిస్థాన్ సీజ్ఫైర్కు దిగొచ్చిందన్నారు.